Sunday, May 22, 2016

BENFITS OF GINGER TO HEALTH

                              అల్లంతో ఆరోగ్య సూత్రాలు                             

అల్లంతో ఆరోగ్య సూత్రాలు

                  అల్లమును, బెల్లమును కాస్త వాక్కాముక్కలుగా రుబ్బి తీసుకుంటే వాతం, శ్లేష్మం హరిస్తుంది. శరీరానికి మంచి బలాన్నిస్తుంది. అల్లం, మిరియాలు, పిప్పళ్ళు, నగకేసరములూ - ఈ నాల్గింటినీ  సమపాళ్ళల్లో  తీసుకొని మెత్తగా దంచి పొడిచేయాలి. ఈ పొడిని ఆవు నెయ్యిలో కలిపి బహిస్టు సమయంలో మూడురోజుల పాటు తీసుకుంటే బహిస్టుకు సంబంధిచిన అన్ని జబ్బులు నయమవుతాయి.

                  అల్లపు రసంలో పాలను కలిపి తీసుకుంటే ఉదర సంబంధమైన అన్ని జబ్బులూ నయమవుతాయి. ఒక కప్పు పాలకు నాలుగు టీ స్పూన్లు అల్లపు రసం వేసి కలిపి వేడి చేసి అందులో కొంచెం  బెల్లం, నెయ్యి, పిప్పళ్ళు వేసి కలిపి  గర్బిణీ స్రీలు తాగితే కడుపునొప్పి, నడుంనొప్పి అలసట నయమవుతాయి.

వినికిడికి అల్లం

                  అల్లపు రసం, వేల్లుల్లి రసం, మునగవేరు రసం ముల్లంగిదుంప రసం  అరటిదుంప రసం వీటిని సమభాగాలుగా తీసుకొని ఒకటిగా కలపాలి ఈ మిశ్రమానికి మూడు రెట్లు ఆవనూనేను కలిపి వేడిచేయాలి ఈ నూనెను చుక్కలు చుక్కలుగా చెవిలో వేస్తే చెవుడు నయమయి చెవులు బాగా పనిచేస్తాయి వినికిడి శక్తి వృద్ది అవుతుంది.

                  అల్లం పచ్చడి రుచిగా వుండటమే కాక ఆరోగ్య ప్రదాయినికూడా........  అల్లం  పచ్చడిని అన్నానికి కలుపుకొని తరచుగా తింటువుంటే మలబద్దకం రానేరాదు. కడుపునొప్పి కఫం నయమవుతాయి. జ్వరం తగ్గి కోలుకుంటున్న వారికి  అల్లం  పచ్చడి తో పథ్యం పెడితే నోటికి రుచిగా వుండటమే గాక అన్నదోషం కూడా నివారింపబడుతుంది.

                  అల్లము కొద్దిగా కాల్చి పై పొట్టు తీసేసి ముక్కలుగా తరిగి ఉప్పుతో నంచుకొని తింటే పిత్తం వల్ల కఫం వల్ల వచ్చే వ్యాధులు రానేరావు. అర ఔన్సు అల్లపు రసంతో కొద్దిగా ఉప్పు చేర్చి నాలుగైదు రోజులపాటు ఉదయం పూట తీసుకుంటే పిత్త సంబందమైన జబ్బులు , దగ్గు , మలబద్దకం, కడుపునొప్పి అన్ని నయమవుతాయి.

                   అల్లమును బెల్లమును సమభాగాలుగా కలిపి కొన్ని రోజులపాటు తింటే  అరచేతుల్లోనూ, అరికాళ్ళల్లోనూ  చర్మం రాలిపోవడాన్ని  అరికట్టవచ్చును. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున ఒక టీ స్పూను అల్లపు రసానికి ఒక టీ  స్పూను తేనెను కలిపి తీసుకుంటూ  వుంటే గుండెకు మంచి బలం చేకూరుతుంది. దీనివలన గుండెకు సంబంధించిన జబ్బులు ఏవీ రావు....

జ్వారానికి అల్లం

                     జ్వరంతో వున్నప్పుడు రెండు టీ స్పూన్లు అల్లపు రసానికి రెండు టీ స్పూన్ల తులసి రసం, ఒక టీ స్పూను తేనే కలిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడు పూటల చొప్పున మూడు రోజులపాటు తీసుకుంటే జ్వరం నయమవుతుంది.
                    కొందరికి జ్వరం లోపలే వుంటుంది . నోరు చేదుగా  వుంటుంది.  అలసట, చికాకుగా వుంటుంది. అలాంటి వారు ఒక పెద్ద అల్లం ముక్కను తెచ్చి పై పొట్టు తెస్సేసి బాగా పొడి పొడిగా తరగాలి. పుదీనా , కొత్తిమీర ఆకును  తుంచి పిడికెడు తీసుకోవాలి . ఇప్పుడు  అన్నింటినీ ఒకటిగా కలిపి అందులో కి నాలుగింట ఒక వంతుగా వచ్చేవరకు వేడిచేసి దించేసి ఆ నీటిని  వడగట్టాలి. అందులో ఒక నిమ్మపండు రసం పిండాలి . రుచి కోసం కలకండ వేసి కలిపి  ఉదయం, సాయత్రం రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుంటే లోపలి జ్వరం నయమవుతుంది - నోటి చేదు తగ్గుతుంది.

అల్లంతో ఆయుష్షు

                   ఆయువ్రుద్దికి అల్లంతో ఒక చిన్న చిట్కా వైద్యం వుంది. ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కను తీసుకొని పై పొట్టుని తేసేసి మెత్తగా నూరి , ఆ ముద్దను ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి పెట్టాలి . కాసేపటికి ముద్ద అడుగున నిలిచిపోతుంది. పై నీటిని మాత్రం వంచుకోవాలి. అందులో కి నాలుగు  టీ స్పూనుల తేనను కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేసేవారికి శరీరానికి మంచి బలం వస్తుంది - ఆయువ్రుద్దికి అవుతుంది.

దగ్గుకు అల్లం 

                  దగ్గుతో బాధపడేవారు ఎంత ఇబ్బంది పడతారో నోటితో చెపితే అర్దమయ్యేది కాదు .  దగ్గుకు అల్లంతో మంచి మందు ఉంది. దీనికి 200 గ్రాముల అతిమదురమును పొడిగా దంచి  ఒక మట్టి పాత్రలో తీసుకుని, పొయ్యిపై  పెట్టి  సన్నని మంటమీద వేయించి తీయాలి. అందులోకి అర లీటరు అల్లపు రసము ను పోసి మట్టి పాత్ర మూతికి గుడ్డను కట్టి ఎండలో పెట్టి ఎండనివ్వాలి. మూడు రోజుల తర్వాత చూస్తే రసం ఇరిగి పొడి మాత్రం ఉంటుంది. ఈ పొడిని 1/4 టీ స్పూను తీసుకొని ఉదయం, రాత్రి  రెండు పూటల బోజనానికి ముందు  వేడి నీటితో కలిపి త్రాగాలి . ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే దగ్గు పూర్తిగా నమవుతుంది.

అల్లం గ్రైప్ వాటర్

                  అల్లంతో చంటిపిల్లకు గ్రైప్ వాటర్ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం 20 గ్రాముల వామును తెచ్చి కొద్దిగా వేయించి మెత్తగా దంచి  ఒక మట్టి పాత్రలో తీసుకోవాలి. అందులోకి అర లీటరు అల్లపు రసాన్ని పోసి పాత్ర  మూతిని  గుడ్డతో కట్టి ,  ఎండలో  పెట్టి మూడురోజుల పాటు ఎండనివ్వాలి . అప్పటికి రసం పూర్తిగా  ఇగిరి పొడి మాత్రం మిలిగి ఉంటుంది.  ఈ వాము పొడిని 1/4 టీ స్పూను తీసుకొని ఒక పల్చని గుడ్డలో మూటకట్టి  అరగ్లాసు నీటిలో వేసి  ఒక నిమిషం పాటు నాననిచ్చి తీసేయాలి. ఈ నీటిని రెండు భాగాలుగా చేసి ఉదయం , సాయత్రం రెండు వేళలా చంటిపిల్లలకు త్రాగించాలి. దీని వలన  పిల్లలకు కడుపు నొప్పి , అజీర్తి , జలుబు వంటి జబ్బులు రానే రావు . అయితే ఈ నీటిని  పిల్లలకు ఆహరం తర్వాతనే ఇవ్వాలి. ఆహారానికి ముందు ఇవ్వకూడదు.  ఈ నీటిని ప్రతి రోజూ తాగిస్తూ వుంటే చంటి పిల్లలకు ఏ రోగము రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

బోజ్జతగ్గటానికి

                   కొందరికి బొజ్జ పెద్దగా పెరిగి, చూడ్డానికే వికారంగా వుంటుంది. బొజ్జ కరగాలంటే దానికి అల్లంతో ఒక వైద్యం వుంది. ఈ అల్లంను దంచి రసం తీయాలి.  ఈ రసం ను పొయ్యి మీద పెట్టి  మరగనివ్వాలి. రసం కాచి ఇరిగిన తర్వాత రసం ఎంత వుంటే అంత తేనెను అందులోకి పోసి కలిపి కాసేపు పోయ్యిమీద వుంచి దించేయాలి. చల్లారిన తర్వాత  సీసాలోకి పోసి నిల్వ చేయాలి.  ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు ఒక టీ స్పూను రసాన్ని వేడి నీటితో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు తీసుకుంటే క్రమంగా బొజ్జ కరిగి పోతుంది.  ...... తర్వాత చాపల్యాన్ని కాస్త అరికట్టి తీపి పదార్దాలు, కొవ్వు పదార్దాలు బాగా తగ్గించుకుంటే  మంచిది . ఈ మందును తీసుకొనే  రోజుల్లో కొందరికి విరోచనాలు    అవుతాయి. అలాంటప్పుడు అర టీ స్పూను మాత్రమే తీసుకవాలి. ముఖ్యంగా రాత్రి తేలికైన ఆహారం తీసుకోవాలి.

కడుపునొప్పికి

                      కడుపునోప్పికి  అల్లంతో  చేసే ఒక మందును  చేసి పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఉపయోగించవచ్చును.  అల్లం 100 గ్రాములు ,  జీలకర 10 గ్రాములు,  దాల్చినచెక్క 10 గ్రాములు, సై0ధవలవనం 20 గ్రాములు కావాలి.  ముందుగా అల్లమును పై పొట్టును తీసేసి బాగా పొడి పొడిగా తరగాలి.  తక్కిన మూడు వస్తువులను  పొడిగా వున్న రోట్లో వేసి  పోడికోట్టాలి. ఇప్పుడు  అన్నిటిని కలిపి  ఒక జాడి లోకి పోసి మిశ్రమం మునిగే వరకు  నిమ్మరసం పోసి  ఎండలో పెట్టాలి. మిశ్రమం  బాగా ఎండి పొడి పొడిగా  అయ్యేదాకా  ఎండనివ్వాలి.
 తర్వాత మరోసారి  మెత్తగా దంచ్చి సీసాలోకి పోసి  నిల్వ చేయాలి కడుపు నొప్పిగా వున్నప్పుడు ఈ పొడిని అర టీ స్పూను నోటిలో వేసుకొని వేడి నీరు తాగితే కడుపు నొప్పి  నయమవుతుంది . గంటసేపతికికల్లా ఆకలి పుడుతుంది.


         



Sunday, May 8, 2016

గన్నేరు విషానికి ఇదిగో విరుగుడు

గన్నేరు విషానికి ఇదిగో విరుగుడు

పిల్లలు తెలియక - పెద్దలు తెలిసి....... ఒక్కోసారి గన్నేరు పప్పు తినేస్తుంటారు. ఈ విషయం తెలియగానే  సాద్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించండి. ఫిట్స్, పక్షపాతం వంటివి చాలా త్వరగా వచ్చేస్తాయి. అందుకనే వెంటనే జాగ్రత్త పడండి.
  •  వాంతి చేయించండి . లోపల కడుపులో మిగిలిన విషాన్ని బైటకు వేల్లగోట్టాలి. 
  •  వాంతి చేయించిన తర్వాత పెరుగులో పటిక బెల్లం కలిపి బాగా ఎక్కువ మోతాదులో తినిపిస్తే  గన్నేరు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
  • కరక్కాయని నీళ్ళలో వేసి నూరి ఆ రసం తాగించండి. గన్నేరు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.

cklik for aaroyasree hospitals hyderabad

 దోసగింజలతో మలబద్దకం మాయం
             బాగా పండిన దోసకాయ లోపలి గింజల్ని విడిగా తీసి ఎండబెట్టి, మెత్తగాదంచి రోజూ ఒకటి - రెండు చెంచాల పొడిని అన్నంతో గానీ, మజ్జిగతో గానీ కలుపుకొని తీసుకోండి - పేగులు చక్కగా కదిలి విరేచనం సాఫీగా అవుతుంది.
         వాతపు నొప్పులన్నీ తగ్గుతాయి. నడుంనొప్పి, కీళ్ళనొప్పులు, తలనొప్పివున్నవారు, మలబద్దకం ఉన్నవారు ఈ గింజల్ని రోజూ తింటే మంచిది.
     కడుపులో మంట, పెగుపూత, గ్యాస్ట్రబుల్ వున్నవారు ఈ దోస గింజల్ని తినవచ్చు.

సుఖవ్యాధులు - ఆయుర్వేదం

సుఖవ్యాధులు - ఆయుర్వేదం
        గనేరియా సుఖవ్యాధి వచ్చినప్పుడు జననాంగం లోంచి చీము, వాపు,నొప్పి, మూత్రం మంటగా వేల్లటం వంటి బాదలు తరచుగా ఉంటాయి.         చాలామంది వ్యాధిని దాస్తారు...... 
       బొంత అరటి కాయని తరచు కూరగా వండుకొని  తినండి.  ఈ అరటికాయ బాగా ముదిరింది తీసుకొని చిన్న ముక్కలుగా  తరిగి ఎండబెట్టి మెత్తగా దంచి  ఒక సీసాలోఉంచి రోజూ ఒక చెంచా మోతాదులో  ముడుపుటలా  పంచదారతో తినండి. ఈ సెగరోగంలో చక్కటి ఉపశమనం కన్పిస్తుంది.
  ఆగకరకయాల కూర చాల మేలు చేస్తుంది.
          పల్లేరుకాయల మొక్కని వ్రేళ్ళతో సహా తెచ్చుకొని , శుభ్రంచేసి, ఎండబెట్టి మెత్తగా దంచి భద్రపరుచుకోండి. రోజు రెండు చెంచాల పొడిని , రెండు గ్లాసుల నీళ్లు పోసి అరగ్లాసు నీరు మిగిలేలా కాషాయం కాచి తాగండి. అవసరం అయితే కొద్దిగా తీపి కలుపుకోండి. వీలైతే రెండు పూటలా తీసుకోండి.
     తంగేడు పూలు , వట్టివేళ్ళు, తుంగముస్తల్ని కూడా పై పద్దతిలోనే కాషాయం తీసుకొని తాగితే మూత్రంలో మంట , బాధ, చీము తగ్గుతాయి.

                              click for  aarogyasree hospitals hyderabad.





సుఖవ్యాధులు - సేగావ్యాధి

                              మూత్రవిసర్జన ద్వారమునుండి చిక్కగా, తెల్లగా, పసుపు పచ్చగా కానీ, ఆకుపచ్చని స్రావము కారుచూ ఉండుట యీ వ్యాధి లక్షణము, ముత్రనాలమందు భరించలేని నొప్పి, మూత్రనాళం వాచుట, ముత్రమును విసర్జించుట చాలా కష్టముగా నుండును. దీనినే "గనేరియా" అని అంటారు.
                               ఈ వ్యాధి గలవారితో సంభోగించుట వలన "గనోకోకస్" అనబడే "క్రిమి"  ద్వారా యీ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఒకరినించి  మరొకరికి అన్తుకోనిన మూడు లేక రెండు రోజులలో అంగము చివర ఒక విధమైన దురద ఆరంభమవుతుంది. బంక మాదిరిగా వుండు స్రావము  విస్తారముగా స్రవించును.
                              ఈ వ్యాధి ముదిరినచో మూత్ర విసర్జన విపరీతమైన భాధగా వుండటమే గాక, ఒక్కొక్కసారి రక్తము కూడా పడుతుంటుంది. వ్యాధి ముదిరిన కేసులకు కీళ్ళు వాచుట, నొప్పులుగా వుండి నడక చాలా ఇబ్భందికరంగా, చాలా దుష్పరిణామాలు ఎదురుకోనవలసి వస్తుంది.                             ముత్రానాళము పుండు మాదిరిగా తయారై విపరీతమైన మంట పుడుతూ చాలా భాదగా వుంటుంది. పురశావయవమూ వంకర తిరుగుట లేపనము చాలా వుండుట శిశ్నాగ్ర చర్మము వెనుకకు లాగుకోనిపోవుట,లేక ముందుకువచ్చుట,  వాపు లక్షణములు, ముఖము, గొంతుపై వురువుడు కాయలు పుట్టుట, మూత్రము వేడిగా వచ్చుచూ, బొట్లు బొట్లుగా వస్తూ చికాకు, అస్తిమితము భాధ  మొదలయిన వికార లక్షణములతో  రోగి విపరీతమైన యాతన పడవలసి వస్తుంది. అశ్రద్ద చేయడమో , సరియైన ఔషద సేవనము చేయకపోవడమో చేసినట్లైతే వ్యాధి జీర్ణించి చాలా రకాల దుష్పలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది.
                            ఇటువంటి వ్యాధులు సోకితే స్త్రీలు పైకి చెప్పుకోలేక, బాధ అనుభవించలేక  వేదనను అనుభవించవలసి రావడం స్త్రీ పురుషుల ఆశ్రద్దవలన ఈ వ్యాధి పుట్టబోయే సంతతికి సరఫరా కావడం కూడా జరుగుతుంది. ఈ వ్యాధి సోకినవారు చాలా జాగ్రత్తగా వుండాలి. గనేరియా స్రావము అంటిన బట్టలు ఎక్కడపడితే అక్కడ వేయరాదు. స్రావమంటిన చేతితో కంటిపాపలు తుడవటం జరిగితే శాశ్వతంగా అంధులయ్యే ప్రమాదం వుంది.               ఈ వ్యాధిగ్రస్తుల బట్టలు వాడటం వలన ఈ వ్యాధి ఎదుటి వారికి సోకుతుంది.

ఒక గాజు గ్లాసుడు మజ్జిగలో నల్ల ఉమేత్త ఆకు రసం తీసి నాలుగు లేక అయిదు చుక్కలు కలిపి పదిహేను రోజులు ఉదయమూ, సాయంత్రం రెండు పూటలా సేవించిన యెడల అధిక ఖర్చు లేకుండా పచ్చ సెన మాయమౌతుంది.



రక్త శగ

                                దీనికి తెల్లనీరుల్లి, మిరియాలు, తులసి ఆకు, మూడు సమానముగా తీసుకొని మెత్తగా నూరి వేరుశనగ గింజ ప్రమాణంలో మాత్రలు చేసుకొని ఉదయమూ, సాయంత్రమూ పదిరోజుల పాటు వేసుకోవాలి. మాత్రల సేవనంతో వ్యాధి క్రమక్రమంగా తగ్గిపోతుంది.                          

    సుఖవ్యాధులకు  హోమియోపతి విధానంలో గూడా చక్కని మందులున్నాయి. శరీరతత్వాన్ని అర్ధం చేసుకొని రోగనిర్ణయం చేయగల వైద్యులు, వైద్యుని అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోగల ఓర్పు రోగులకు అవసరం.




















కాన్సర్ - రేడియోథెరపి అవగాహన

కేన్సర్ రేడియోథెరపి అంటే.......... మీకు , మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు అది ఏ విధంగా  పనిచేసేది దాని వలన కలిగే భాదలు, వాటి నివారణ మున్నగు విషయాల గురుంచి అవగాహన కోసం.

రేడియోథెరపి తీసుకునేటప్పుడు మీమ్మల్ని గూర్చి మీరు శ్రద్ద తీసుకోవడం అవసరం. ఒక్కోసారి చిన్న బాధలే పెద్ద సమస్యకు దారి తీయవచ్చును. కానీ మీకు కలిగే చిన్న చిన్న సమస్యల్ని తొలగిస్తుంది.మీ జబ్బు మీ చేయిదాటిపొందనుకునే సందర్బంలో మీ వ్యాధిని గూర్చి ముందుగ తెలుసుకుంటే కొంత ఊరట కలుగుతుంది.

ఒకసారి కేన్సర్ కు గురిఐన తర్వాతా '' రేడియేషన్ - మీరు'' అనేది  మీకు ఒక భాగస్వామ్యం అనుకోవాలి. చికిస్థ కంటే ఎక్కువ కాదు....... పూర్తి వివరాలకు మీ డాక్టర్ గారిని సంప్రదించండి.......

                                                      ఇట్లు.... మీ గుండమల్ల మల్లేష్.....


                                       కేన్సర్ - రేడియోథెరపి

రేడియోథెరపి అనగా.... .......                              

      కేన్సర్ కణాలని చంపుటకు మిక్కిలి శక్తివంతమైన ఎలక్ట్రానుల నుండి ఉద్భవించే

X- రే కణాలని పంపించుట.

రేడియోథెరపి చికిస్థ పనిచేయు విదానం.......                                

        మామూలుగా జీవకణాలు విభజించబడి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఒక క్రమ పద్దతిలో శరీరావయవాలు నిర్మాణానికుపకరిస్తాయి.  జీవకణాలు వాటి పెరుగుదలను అరికట్టలేనప్పుడు కేన్సర్ వ్యాధి కలుగుతుంది. ఈ అసాధారణ కణాలు త్వరగా విభజింపబడి కణముల సముదాయంగా మారి కణితిగా ఏర్పడుతుంది. ఆ కణాల చుట్టూ వుండే అవయవాలలోనికి,భాగాలలోనికి వ్యాప్తి చెందుతవి.

కేన్సర్ కణాల, పునరుత్పత్తికి మూలభాగమైన DNA ను రేడియేషన్  ద్వారా చంపగలుగుతున్నాము. ఇవి చచ్చిపోయినందున అవి విభజించబడవు. ఆ విధంగా వాటి పెరుగుదల ఆగిపోయి ఆ కణతి కుంచించుకుపోతుంది.త్వరగాను, అతిగాను పెరిగే కణాల మీదే ఈరేడియేషన్ భాగా పనిచేస్తుంది.

రేడియోథెరపి ఏ విధంగా ప్రయోగిస్తారు.......      

               రేడియోథెరపి చికిస్థలో   తర్పీదు పొందిన డాక్టర్లని "రేడియేషన్ ఆంకాలజిస్ట్"  అంటారు. ఎక్కువ శక్తివంతమైన X-రేలను గాని, రేడియోయాక్టివ్ ఐసోటోపూలను గాని  నిర్దిష్టంగా కేన్సర్ కణాలలోకి గాని, ఆ కణితులలోనికి గాని ప్రసరింపజేస్తారు.  ఆ కిరణాలు మామూలు కణాల మీద ప్రసరించకుండా తగిన జాగ్రతలు తీసుకొని, కేన్సర్ కణాలనే నాశనంచేసేట్లుగా చూస్తారు. మామూలు కణజాలానికి షీల్డులు అడ్డం పెడతారు.

ఎన్ని రకాల జాగ్రతలు తీసుకున్న, కేన్సర్ కణాలతో పాటే మామూలు కణాలు కూడా దెబ్బతింటవి. కాని  అవి నెమ్మదిగా  కోలుకొని మామూలు స్థితికి చేరుకుంటవి.

రేడియోథెరపి యొక్క గమ్యం ......

   అనేక రకాల కేన్సర్ జబ్బులకు,శరీరంలోని అన్ని భాగాలకు సంక్రమించే కేన్సర్ వ్యాధులకు రేడియోథెరపి నే ముఖ్యమైన చికిస్థా విదానం. ఇవి రెండు రకాలు....

కేన్సర్ వ్యాధిని నయం చేయుట.,   భాదలనుండి ఉపశమనం కలిగించుట......

   ఎక్కువ మంది కేన్సర్ రోగులలో రేడియోథెరపి మాత్రమే చేయవల్సివుంటుంది. కానీ ఒక్కోసారి కీమోథెరపీ తోటి లేక ఆపరేషన్ల తోటి కలిపి చేయవలసి వుంటుంది. సర్జరీకి ముందు కేన్సర్, వాపు తగ్గుటకు మరియు మిలిగిన కేన్సర్ కణాలని నాశనం చేయటానికి రేడియోథెరపి చేయవలసి ఉంటుంది. కేన్సర్ కణాలు పూర్తిగా నాశనం కావడానికి ఒక్కోసారి రేడియోథెరపితో పాటు కిమోథెరపీ  కూడా చేయవల్సివుంటుంది.

    రేడియోథెరపి కేవలం వత్తిడి తగ్గుటకు, రక్తస్రావం ఆగుటకు, కేన్సర్ భాగం కుచిన్చుకుపోవుటకు మాత్రమే కాకుండా పై భాదలనుండి విముక్తి పొందుటకు, ఉపశమనం పొందుటకు కుడా చేయవలసి వుంటుంది.

లైంగిక శక్తి ,శుక్రకణాల అభివృద్దికి బాదంపప్పు


 లైంగిక శక్తి ,శుక్రకణాల అభివృద్దికి బాదంపప్పు
                 క్లిక్ ఫర్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ హైదరాబాద్

మూత్ర వ్యాధులు , జననేంద్రియా వ్యాధులు అన్నింట్లోను బాదం పప్పుల్ని తినడం మంచిది.
  • బాదంపప్పుల వలన లైంగిక శక్తి పెరుగుతుంది - 
  • సంతానం కలగని పురుషులలో శుక్రకణాలను పెంచేందుకు దోహదపడుతుంది.
  • ఊపిరితిత్తుల్లో వచ్చే వ్యాధుల్లోనూ, ముత్ర వ్యాధులలోను ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
  • బాదంపప్పులను ఎక్కువగావందకూడదు,వేయించకూడదు.
  • పాయసంలాంటివి చేసుకున్నప్పుడు చల్లార్చిన తర్వాత బాదం పప్పుల్ని కలుపుకొని తింటే కోరుకున్న ప్రయోజనం దక్కుతుంది.
  • శుక్రకణాలను వృద్దిచేసి లైంగిక శక్తిని పెంపొందింపచేసే అద్భుత ద్రవ్యాలలో దాల్చినచెక్క  ముక్యమైనది. దాల్చినచెక్క పొడిని  ఒక స్పూను  ప్రతి రోజు ఒక గ్లాస్ పాలల్లో చెక్కెర కలుపుకొని ఉదయం తీసుకోవాలి.
click for aarogyasri hospitals hyderabad



త్వరగా రతి సమర్ధతను పెంచడానికి చిట్కా
 శ్రీఘ్రస్ఖలనం  వలన సంసార సుఖం సరిగా లేక అసంతృప్తి పొందుతున్న మగవారు అనవసరంగా సెక్స్ స్పెషలిస్టుల చూట్టూ తిరగావలిసిన పనిలేదు.   
జాజికాయ 5  గ్రాములు,  జాపత్రి 5 గ్రాములు,  పచ్చకర్పూరం 5 గ్రాములు ఈ మూడింటిని తీసుకొని మెత్తగా దంచి ,  చిన్న శనగగింజంత మాత్ర చేసుకొని, రోజూ రాత్రి పూట ఒకటి లేదా రెండు మాత్రలు వేసుకొని పాలూ తాగండి.
  1. శ్రీఘ్రస్ఖలనం తగ్గుతుంది.
  2. చలవనిస్తుంది  శరీరానికి .
  3. అలసట తీరుతుంది. నీరసం తగ్గుతుంది.
  4. రతి సమర్ధత పెరుగుతుంది.
  5. మీరు ఏదైనా మందు వేసుకొంటున్నప్పుడు, ముఖ్యంగా ఆయుర్వేద మందులూ  వేసుకొంటున్నప్పుడు వాటిని వేసుకున్న తర్వాత ఈ మాత్ర ఒకటి వేసుకొంటే, ఆ మందు త్వరగా పనిచేస్తుంది. దాని వలన ఎటువంటి వేడి కలగనీయదు.
  6. జలుబు చేసే తత్వం వున్నవారు మాత్రం ఈ మాత్రల్ని ఎక్కువగా వాడకుండా వుంటే మంచిది.
  7. హస్తప్రయోగం వంటి దురభ్యాసాలకు లోనై తాము భవిష్యత్తులో సంసార సుఖానికి పనికిరామేమోననే అనుమానంతో క్రుంగిపోయే కుర్రాళ్ళకు  ఇది మంచి మందు. భవిషత్తులో వారి సమర్ధతని ఇది ఈనాటి నుంచే కాపాడుతుంది.

కిడ్ని - రాళ్ళు- వాము,అరటి, తలలో పేలు, పులిపిరికాయలు,ఆనెల నివారణ.



కిడ్ని - రాళ్ళు- వాము


ముత్ర పిండాల్లోని రాళ్ళు త్వరగా కరిగేందుకు చాలా తేలికైన ఉపాయం...
వాముని వేయించి, మెత్తగా దంచి ఒక సీసా లో భద్రపరుచుకోండి . రెండు చెంచాల పొడిని  రెండు గ్లాసుల నీటిలో కలిపి , అర గ్లాస్ మిలిగేలా కాచి ఆ నీటిని  వడగట్టండి. ఇదే వాము కాషాయం.
       దీన్ని ఇలా రెండు పుటలు కొన్నాలపాటు రోజూ తీసుకుంటే  ముత్రపిండాల్లో రాళ్ళు కరిగి బైటకుపోతాయి.
   ఇంకా.........
     వాత వ్యాధులు , మెదడు వ్యాధులు, స్త్రీల గర్భాశయ వ్యాధులు  అన్ని తగ్గుతాయి. పాలిచ్చే తల్లులకు పాలు పెరుగుతాయి.



కడుపులోరాళ్ళు - అరటి  

ముత్రపిండాల్లో , లివర్ (గాల్ బ్లాడర్) లోనువివిధ కారణాలవల్ల రక రకాల రాళ్ళు ఏర్పడే అవకాశం వుంది.
   మూత్రపిండాలలో రాళ్ళని ముత్రాశ్మరి (renal calculi) అని, లివర్ లో రాళ్ళని పిత్తాశ్మరి ( gallstomes )  అని అంటారు. 
 కారణం ఏ దైనా ఈ రాళ్ళు కరిగి కొట్టుకుపోవాలి.
  1.  అరటి దుంపని దంచి రసం తీసుకొని రోజూ తాగండి . ఏ రకం రాయి అయిన కరుగుతుంది.
  2. అరటి ఊచని కుడా రసం తీసి తేనేకలుపుకొని తాగవచ్చు.
  3. అరటి ఊచని కూరగా వండుకోండి.
  4. అరటి ఆకులో భోజనం చేయండి. 
  5. అరటి పళ్ళు తినండి.
అరటికి సంబంధించిన సమస్తం ఈ వ్యాధి పైన చక్కగా ఉపయోగ పడుతుంది.


ఖచ్చితంగా ఆపరేషన్లు చేయవలిసిన రాళ్ల  సైజు 7 mm కంటే ఎక్కువగా ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా చేయవచ్చు..


తలలో పేల నివారణ

  సీతాఫలం ఆకులను/ గింజలను గాని 
మెత్తగా రుబ్బి , తలకు బాగా అంటేలా పట్టించి అరగంట నుంచి నలబైఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి ఆతర్వాత తలస్నానం చేస్తే తలలోని పేలనుంచి విముక్తి పొందవచ్చు.
     తలలో పేలతో బాధపడేవారు వెల్లుల్లిపాయరసం తీసి తలకు బాగా పట్టేలా రాసుకుంటే పేలబాద తప్పుతుంది.




 పులిపిరికాయలు

          వైరస్ వలన చర్మం మీద  ఏర్పడే కాయలు వంటివి.  అరికాలులో గురుకుగా , మొద్దుబారిన పులిపిరి కయపిలుకలు కన్పిస్తాయి. కొంత మందికి చేడు రక్తం ఉండి, లైంగిక కలయిక ద్వారా కూడా రావచ్చును. చర్మాన్ని క్షినిన్పచేసే వ్యాధిగా పరిగణించే అవకాశము వున్నది.           కొన్ని రకాల  లైంగిక వ్యాధులు రెండవ దశలో ఆసనము, యోని ప్రాంతాలలో దళసరి పులిపిరి కాయల సమూహం ఉంటుంది.                 సాదారణమైన పులిపిరికాయలు చర్మం మీద గుండుసూది తలకయంత సైజులో లేదా  బటానిగింజ సైజులో ఉంటాయి. ఇవి చేతులు, కాళ్ళు, మెడ మొ,, ప్రాంతాలల్లో ఎక్కడైనా రావచ్చును.           ఇవి పగిలి, దాని చీము గాని , రసం గాని చర్మానికి వ్యాపిస్తే అక్కడ కుడా పులిపిరికాయలు పుట్టుకొస్తాయి. అందుకనే దీనిని అంటూ వ్యాధిగా చెప్పుకోవాలి.               ఆనేలకు చేసే చికిత్స దీనికి చేయవచ్చు. గుల్లసున్నం చిక్కగా నీళ్ళతో కలిపి ఈ పులిపిరికాయలమీద మృదువుగా దట్టంగా రాయాలి. రాలిపోయేవరకు ప్రతిరోజు.



ఆనెలు
              కీలులోగాని, చేతిలోగాని బాగా పని ఒత్తిడి లేదా రాపిడి వున్న ప్రాంతంలో పెరిగే గట్టి కొమ్మువంటి చర్మపు ముద్దనే "ఆనె" అంటారు.
                   గాయాలు తగిలి తగ్గిపోయిన చోట కూడా చిన్న చిన్న ఆనెలు వస్తుంటాయి. ఈ ఆనెల మీద గుల్లసున్నమును తడిచేసి జాగ్రత్తగా పూతపూయాలి.
         లేదా కామంచి ఆకుల రసంలో కొద్దిగా సైంధవలవణం కలిపి ఆనెల మీద రాయాలి. ఆనెలను బ్లేడుతో కోయడం వంటి పనులు చేయగూడదు.


                                     క్లిక్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ హైదరాబాద్




మొటిమలు...

మొటిమలు

సాధారణంగా యవ్వనదశలో ప్రధానంగా బుగ్గలమీద వచ్చు పోక్కులను మొటిమలని అంటారు.  ఇవి ముఖ్యంగా  బుగ్గలమీదనే కాక వీపు మీద కూడా వస్తుంటాయి.శరీరతత్వాన్ని అనుసరించి కొంతమందికి చాతి మీద,నుడురురు మీద, చేతుల మీద కుడా మొటిమలు వస్తుంటాయి. పెసరిగింజ ఆకారంలో ప్రారంభమై చిన్న రేగి కాయంత పరిణామంలో మొటిమలు రాగలవు. ఇవి దీర్గాకాలం  వుండే అవకాశం లేకపోలేదు.
              గులాబి రంగులో అందంగా  వుండే ఈ పోక్కులను అసహ్యకరంగా తలుచుకొని భాదపడుతుంటారు. మొటిమలలో చీము వుంటుంది. బుగ్గల మీద వచ్చే మొటిమలను గిల్లకూడదు. కొంతమంది ఏమీ తోచనప్పుడు కూడా వాటిని గిల్లుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు.  గిల్లిన వెంటనే, మోటిమలోని చీము ఎంతో కొంతైనా చుట్టుప్రక్కలకు పాకుతుంది. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.కొన్ని సందర్భాల్లో గిల్లిన వెంటనే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించే అవకాశం వుంది.  వాస్తవానికి ఇదేమి వ్యాధి కాదు. యుక్తవయసు ప్రారంభదశలో రక్త హీనత వుండి థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయకపోవడంతో మొటిమలు ఏర్పడుతాయి.
              మొటిమలు రావడానికి ఎన్నెన్నో కారణాలను, అభూతకల్పనలు చెబుతుంటారు.యవ్వన దశలో ఇవి భావించి, సకాలంలో సరైన చికిత్స తీసుకోవాలి. ముందుగా ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి. కొవ్వు పదార్దాలాకు ( వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ , చాక్లెట్ బార్, మాంసం, కోడిగుడ్లు, వేపుడు కూరలు, దుంప కూరలు,  వేరుశనగ మొ..) చాలా దూరంగా వుండాలి.  రోజుకు మూడు సార్లు ( నిద్రకు ఉపక్రమించే ముందు కుడా) శుబ్రముగా ముఖాన్ని వేడినీటితో ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలి.
          చందనం పోడిగాని, చందనం ఆయిల్  గాని తరచు  మొటిమల మీద రాయడం మంచిది. లేదా చందనం మిరియాలు , జాజికాయ తొక్కలను బాగా నూరి ముద్ద చేసి , మొటిమల మీద పూత పూయాలి.   



పోషకాలు శరీరానికి అందాలంటే

  • ఏ కురగాయలనైన  ఎక్కువగా ఉడికించకూడదు. ఆవిరిమీద ఉడికిస్తే మంచిది.
  • కురగాయాలలో ఉన్న చాల విటమిన్లకు నీటిలో కరిగే గుణం ఉంటుంది. ఉడికించేటప్పుడు అవి నీటిలోకి చేరుతాయి. కాబట్టి ఉడికించడానికి తక్కువ నీటిని వాడండి.
  • ఉడికించిన తర్వాత ఆ నీటిని పారబోయద్దు. రసం లేక సాంబారు చేసేటప్పుడు వాటిని వాడండి.
  • కూరగాయలను వండటానికి ముందే కోయండి.
  • మసాల కూరలు చేయాలంటే మొదట గ్రేవి తయారు చేసాక దానిలో చివర ఉడికించిన కూరలను కలపండి.
  • కురగాయలల్లోతగినంత ఉప్పు  సహజంగా నే ఉంటుంది. కాబట్టి పచ్చివి తినేటప్పుడు అదనంగా ఉప్పు కల్పవద్దు.
  • విదేశాల నుండి దిగుమతైన యాపిల్స్ తినే ముందు తొక్క తీసి తినండి. ఎందుకంటే అవి మెరవడానికి సన్నని మైనపు పూత పూస్తారు.
  • ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర కూరగాయలు కొనొద్దు . వాహానాలు వదిలే పొగ వాటి మీద కమ్ముకుని ఉంటుంది. 
  • చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మనచేతుల్లోనే.......