పిల్లలు తెలియక - పెద్దలు తెలిసి....... ఒక్కోసారి గన్నేరు పప్పు తినేస్తుంటారు. ఈ విషయం తెలియగానే సాద్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించండి. ఫిట్స్, పక్షపాతం వంటివి చాలా త్వరగా వచ్చేస్తాయి. అందుకనే వెంటనే జాగ్రత్త పడండి.
- వాంతి చేయించండి . లోపల కడుపులో మిగిలిన విషాన్ని బైటకు వేల్లగోట్టాలి.
- వాంతి చేయించిన తర్వాత పెరుగులో పటిక బెల్లం కలిపి బాగా ఎక్కువ మోతాదులో తినిపిస్తే గన్నేరు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
- కరక్కాయని నీళ్ళలో వేసి నూరి ఆ రసం తాగించండి. గన్నేరు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
cklik for aaroyasree hospitals hyderabad
దోసగింజలతో మలబద్దకం మాయం
బాగా పండిన దోసకాయ లోపలి గింజల్ని విడిగా తీసి ఎండబెట్టి, మెత్తగాదంచి రోజూ ఒకటి - రెండు చెంచాల పొడిని అన్నంతో గానీ, మజ్జిగతో గానీ కలుపుకొని తీసుకోండి - పేగులు చక్కగా కదిలి విరేచనం సాఫీగా అవుతుంది.
వాతపు నొప్పులన్నీ తగ్గుతాయి. నడుంనొప్పి, కీళ్ళనొప్పులు, తలనొప్పివున్నవారు, మలబద్దకం ఉన్నవారు ఈ గింజల్ని రోజూ తింటే మంచిది.
కడుపులో మంట, పెగుపూత, గ్యాస్ట్రబుల్ వున్నవారు ఈ దోస గింజల్ని తినవచ్చు.
No comments:
Post a Comment