Sunday, May 22, 2016

BENFITS OF GINGER TO HEALTH

                              అల్లంతో ఆరోగ్య సూత్రాలు                             

అల్లంతో ఆరోగ్య సూత్రాలు

                  అల్లమును, బెల్లమును కాస్త వాక్కాముక్కలుగా రుబ్బి తీసుకుంటే వాతం, శ్లేష్మం హరిస్తుంది. శరీరానికి మంచి బలాన్నిస్తుంది. అల్లం, మిరియాలు, పిప్పళ్ళు, నగకేసరములూ - ఈ నాల్గింటినీ  సమపాళ్ళల్లో  తీసుకొని మెత్తగా దంచి పొడిచేయాలి. ఈ పొడిని ఆవు నెయ్యిలో కలిపి బహిస్టు సమయంలో మూడురోజుల పాటు తీసుకుంటే బహిస్టుకు సంబంధిచిన అన్ని జబ్బులు నయమవుతాయి.

                  అల్లపు రసంలో పాలను కలిపి తీసుకుంటే ఉదర సంబంధమైన అన్ని జబ్బులూ నయమవుతాయి. ఒక కప్పు పాలకు నాలుగు టీ స్పూన్లు అల్లపు రసం వేసి కలిపి వేడి చేసి అందులో కొంచెం  బెల్లం, నెయ్యి, పిప్పళ్ళు వేసి కలిపి  గర్బిణీ స్రీలు తాగితే కడుపునొప్పి, నడుంనొప్పి అలసట నయమవుతాయి.

వినికిడికి అల్లం

                  అల్లపు రసం, వేల్లుల్లి రసం, మునగవేరు రసం ముల్లంగిదుంప రసం  అరటిదుంప రసం వీటిని సమభాగాలుగా తీసుకొని ఒకటిగా కలపాలి ఈ మిశ్రమానికి మూడు రెట్లు ఆవనూనేను కలిపి వేడిచేయాలి ఈ నూనెను చుక్కలు చుక్కలుగా చెవిలో వేస్తే చెవుడు నయమయి చెవులు బాగా పనిచేస్తాయి వినికిడి శక్తి వృద్ది అవుతుంది.

                  అల్లం పచ్చడి రుచిగా వుండటమే కాక ఆరోగ్య ప్రదాయినికూడా........  అల్లం  పచ్చడిని అన్నానికి కలుపుకొని తరచుగా తింటువుంటే మలబద్దకం రానేరాదు. కడుపునొప్పి కఫం నయమవుతాయి. జ్వరం తగ్గి కోలుకుంటున్న వారికి  అల్లం  పచ్చడి తో పథ్యం పెడితే నోటికి రుచిగా వుండటమే గాక అన్నదోషం కూడా నివారింపబడుతుంది.

                  అల్లము కొద్దిగా కాల్చి పై పొట్టు తీసేసి ముక్కలుగా తరిగి ఉప్పుతో నంచుకొని తింటే పిత్తం వల్ల కఫం వల్ల వచ్చే వ్యాధులు రానేరావు. అర ఔన్సు అల్లపు రసంతో కొద్దిగా ఉప్పు చేర్చి నాలుగైదు రోజులపాటు ఉదయం పూట తీసుకుంటే పిత్త సంబందమైన జబ్బులు , దగ్గు , మలబద్దకం, కడుపునొప్పి అన్ని నయమవుతాయి.

                   అల్లమును బెల్లమును సమభాగాలుగా కలిపి కొన్ని రోజులపాటు తింటే  అరచేతుల్లోనూ, అరికాళ్ళల్లోనూ  చర్మం రాలిపోవడాన్ని  అరికట్టవచ్చును. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున ఒక టీ స్పూను అల్లపు రసానికి ఒక టీ  స్పూను తేనెను కలిపి తీసుకుంటూ  వుంటే గుండెకు మంచి బలం చేకూరుతుంది. దీనివలన గుండెకు సంబంధించిన జబ్బులు ఏవీ రావు....

జ్వారానికి అల్లం

                     జ్వరంతో వున్నప్పుడు రెండు టీ స్పూన్లు అల్లపు రసానికి రెండు టీ స్పూన్ల తులసి రసం, ఒక టీ స్పూను తేనే కలిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడు పూటల చొప్పున మూడు రోజులపాటు తీసుకుంటే జ్వరం నయమవుతుంది.
                    కొందరికి జ్వరం లోపలే వుంటుంది . నోరు చేదుగా  వుంటుంది.  అలసట, చికాకుగా వుంటుంది. అలాంటి వారు ఒక పెద్ద అల్లం ముక్కను తెచ్చి పై పొట్టు తెస్సేసి బాగా పొడి పొడిగా తరగాలి. పుదీనా , కొత్తిమీర ఆకును  తుంచి పిడికెడు తీసుకోవాలి . ఇప్పుడు  అన్నింటినీ ఒకటిగా కలిపి అందులో కి నాలుగింట ఒక వంతుగా వచ్చేవరకు వేడిచేసి దించేసి ఆ నీటిని  వడగట్టాలి. అందులో ఒక నిమ్మపండు రసం పిండాలి . రుచి కోసం కలకండ వేసి కలిపి  ఉదయం, సాయత్రం రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుంటే లోపలి జ్వరం నయమవుతుంది - నోటి చేదు తగ్గుతుంది.

అల్లంతో ఆయుష్షు

                   ఆయువ్రుద్దికి అల్లంతో ఒక చిన్న చిట్కా వైద్యం వుంది. ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కను తీసుకొని పై పొట్టుని తేసేసి మెత్తగా నూరి , ఆ ముద్దను ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి పెట్టాలి . కాసేపటికి ముద్ద అడుగున నిలిచిపోతుంది. పై నీటిని మాత్రం వంచుకోవాలి. అందులో కి నాలుగు  టీ స్పూనుల తేనను కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేసేవారికి శరీరానికి మంచి బలం వస్తుంది - ఆయువ్రుద్దికి అవుతుంది.

దగ్గుకు అల్లం 

                  దగ్గుతో బాధపడేవారు ఎంత ఇబ్బంది పడతారో నోటితో చెపితే అర్దమయ్యేది కాదు .  దగ్గుకు అల్లంతో మంచి మందు ఉంది. దీనికి 200 గ్రాముల అతిమదురమును పొడిగా దంచి  ఒక మట్టి పాత్రలో తీసుకుని, పొయ్యిపై  పెట్టి  సన్నని మంటమీద వేయించి తీయాలి. అందులోకి అర లీటరు అల్లపు రసము ను పోసి మట్టి పాత్ర మూతికి గుడ్డను కట్టి ఎండలో పెట్టి ఎండనివ్వాలి. మూడు రోజుల తర్వాత చూస్తే రసం ఇరిగి పొడి మాత్రం ఉంటుంది. ఈ పొడిని 1/4 టీ స్పూను తీసుకొని ఉదయం, రాత్రి  రెండు పూటల బోజనానికి ముందు  వేడి నీటితో కలిపి త్రాగాలి . ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే దగ్గు పూర్తిగా నమవుతుంది.

అల్లం గ్రైప్ వాటర్

                  అల్లంతో చంటిపిల్లకు గ్రైప్ వాటర్ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం 20 గ్రాముల వామును తెచ్చి కొద్దిగా వేయించి మెత్తగా దంచి  ఒక మట్టి పాత్రలో తీసుకోవాలి. అందులోకి అర లీటరు అల్లపు రసాన్ని పోసి పాత్ర  మూతిని  గుడ్డతో కట్టి ,  ఎండలో  పెట్టి మూడురోజుల పాటు ఎండనివ్వాలి . అప్పటికి రసం పూర్తిగా  ఇగిరి పొడి మాత్రం మిలిగి ఉంటుంది.  ఈ వాము పొడిని 1/4 టీ స్పూను తీసుకొని ఒక పల్చని గుడ్డలో మూటకట్టి  అరగ్లాసు నీటిలో వేసి  ఒక నిమిషం పాటు నాననిచ్చి తీసేయాలి. ఈ నీటిని రెండు భాగాలుగా చేసి ఉదయం , సాయత్రం రెండు వేళలా చంటిపిల్లలకు త్రాగించాలి. దీని వలన  పిల్లలకు కడుపు నొప్పి , అజీర్తి , జలుబు వంటి జబ్బులు రానే రావు . అయితే ఈ నీటిని  పిల్లలకు ఆహరం తర్వాతనే ఇవ్వాలి. ఆహారానికి ముందు ఇవ్వకూడదు.  ఈ నీటిని ప్రతి రోజూ తాగిస్తూ వుంటే చంటి పిల్లలకు ఏ రోగము రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

బోజ్జతగ్గటానికి

                   కొందరికి బొజ్జ పెద్దగా పెరిగి, చూడ్డానికే వికారంగా వుంటుంది. బొజ్జ కరగాలంటే దానికి అల్లంతో ఒక వైద్యం వుంది. ఈ అల్లంను దంచి రసం తీయాలి.  ఈ రసం ను పొయ్యి మీద పెట్టి  మరగనివ్వాలి. రసం కాచి ఇరిగిన తర్వాత రసం ఎంత వుంటే అంత తేనెను అందులోకి పోసి కలిపి కాసేపు పోయ్యిమీద వుంచి దించేయాలి. చల్లారిన తర్వాత  సీసాలోకి పోసి నిల్వ చేయాలి.  ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు ఒక టీ స్పూను రసాన్ని వేడి నీటితో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు తీసుకుంటే క్రమంగా బొజ్జ కరిగి పోతుంది.  ...... తర్వాత చాపల్యాన్ని కాస్త అరికట్టి తీపి పదార్దాలు, కొవ్వు పదార్దాలు బాగా తగ్గించుకుంటే  మంచిది . ఈ మందును తీసుకొనే  రోజుల్లో కొందరికి విరోచనాలు    అవుతాయి. అలాంటప్పుడు అర టీ స్పూను మాత్రమే తీసుకవాలి. ముఖ్యంగా రాత్రి తేలికైన ఆహారం తీసుకోవాలి.

కడుపునొప్పికి

                      కడుపునోప్పికి  అల్లంతో  చేసే ఒక మందును  చేసి పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఉపయోగించవచ్చును.  అల్లం 100 గ్రాములు ,  జీలకర 10 గ్రాములు,  దాల్చినచెక్క 10 గ్రాములు, సై0ధవలవనం 20 గ్రాములు కావాలి.  ముందుగా అల్లమును పై పొట్టును తీసేసి బాగా పొడి పొడిగా తరగాలి.  తక్కిన మూడు వస్తువులను  పొడిగా వున్న రోట్లో వేసి  పోడికోట్టాలి. ఇప్పుడు  అన్నిటిని కలిపి  ఒక జాడి లోకి పోసి మిశ్రమం మునిగే వరకు  నిమ్మరసం పోసి  ఎండలో పెట్టాలి. మిశ్రమం  బాగా ఎండి పొడి పొడిగా  అయ్యేదాకా  ఎండనివ్వాలి.
 తర్వాత మరోసారి  మెత్తగా దంచ్చి సీసాలోకి పోసి  నిల్వ చేయాలి కడుపు నొప్పిగా వున్నప్పుడు ఈ పొడిని అర టీ స్పూను నోటిలో వేసుకొని వేడి నీరు తాగితే కడుపు నొప్పి  నయమవుతుంది . గంటసేపతికికల్లా ఆకలి పుడుతుంది.


         



No comments:

Post a Comment